Header Banner

ముంబై–హైదరాబాద్‌లలో ఈడీ మెరుపు దాడులు! రూ. 32 కోట్ల ఆస్తుల స్వాధీనం!

  Thu May 15, 2025 19:20        Politics

ముంబైకి చెందిన వసాయి విరార్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (వీవీఎంసీ) పరిధిలో వెలుగుచూసిన భారీ కుంభకోణంపై ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గురువారం అధికారులు కీలక ముందడుగు వేశారు. ముంబై, హైదరాబాద్‌ నగరాలతో పాటు మొత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు నిర్వహించారు.

ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటించింది. సుమారు రూ.9.04 కోట్ల నగదుతో పాటు, రూ.23.25 కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.32 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

ముంబైలోని మిరా భయాందర్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ అక్రమాలపై పలు కేసులు నమోదయ్యాయి. వీటి ఆధారంగా ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను ఆక్రమించి, నిబంధనలకు విరుద్ధంగా 2009 సంవత్సరం నుంచి అక్రమ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు ఈడీ గుర్తించింది.

ఈ కుంభకోణంలో సీతారాం, అరుణ్ అనే వ్యక్తులు కీలక నిందితులుగా ఉన్నట్లు ఈడీ పేర్కొంది. కొందరు అవినీతి అధికారులతో వీరు కుమ్మక్కై, ప్రభుత్వ స్థలాల్లో కూడా చట్టవిరుద్ధంగా నిర్మాణాలు చేపట్టి, అమాయక ప్రజలకు విక్రయించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగానే వీవీఎంసీ టౌన్‌ప్లానింగ్‌ విభాగపు డిప్యూటీ డైరెక్టర్‌ వైఎస్‌ రెడ్డి నివాసంలో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిందితుల ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!


చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ed #rides #hyderbad #mumbai #32crore